Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

భారత ఆర్మీ చేతికి కొత్త అస్త్రాలు.. అవన్నీ దేశీయంగా తయారైనవే…

దేశీయంగా తయారు చేసిన అత్యాధునిక ఆయుధ సంపత్తిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అప్పజెప్పారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు పరిసరాల్లో మోహరించడానికి, సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి ఈ అత్యాధుని ఆయుధాలు ఉపయోగపడతాయి. నిపుణ్ అనే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్, ల్యాండింగ్ క్రాఫ్ట్, ఫ్యూచర్ ఇన్ ఫ్యాంట్రీ సోల్జర్ యాజ్ ఏ సిస్టమ్, రక్షిత పదాదిదళానికి చెందిన వాహనాల వంటి కీలకమైన సైనిక సంపత్తి వున్నాయి. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆ పరికరాలు పనిచేస్తాయి. సైనికుడికి రక్షణ కల్పించడానికి వీలుగా అత్యాధునికమైన హెల్మెట్ తో పాటు బుల్లెట్ ప్రూఫ్ కూడా వుంటుంది. ఇక.. మిగతా పరికరాలు కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించింది. ఈ దేశీయ తయారీపై రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates