2030 నాటికి దేశంలో 2 కోట్లకు పైగా విద్యుత్ వాహనాలు రోడ్ల మీద తిరుగుతాయని, ఫలితంగా కాలుష్యం తగ్గుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోందని అన్నారు. ముఖ్యంగా గత రెండేళ్లల్లో ఈవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ ఫ్యూటర్ మొబిలిటీ థీమ్తో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. 2030 నాటికి 2 కోట్లకు పైగా ఈవీలు భారత్ లో తిరుగుతాయని, కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధిచెందుతుందని, దేశం ఆత్మనిర్భరంగా మారుతుందని ప్రకటించారు.
ఇంధన దిగుమతి భారత్ కు పెద్ద సవాలేనని అంగీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని రూ. 16 లక్షల కోట్లు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకే విదేశాలకు వెళతాయని వెల్లడించారు. సాధారణంగా కాలుష్యంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఉంటాయి. కాలుష్యంలో 40 శాతం వాటా రవాణా రంగానిదని గడ్కరీ తెలిపారు. దానిని తగ్గించేందుకు కృషిచేస్తున్నట్టు చెబుతూ విద్యుత్ బస్సులను పెంచాలని చూస్తున్నట్టు వెల్లడించారు.
ఇంధన దిగుమతి భారత్ కు పెద్ద సవాలేనని అంగీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని రూ. 16 లక్షల కోట్లు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకే విదేశాలకు వెళతాయన్నారు. ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతే చేసుకుంటామని, ఫలితంగా విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తోందని వివరించారు. విద్యుత్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఇది దిగొస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.