Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

అమెరికాలోని టంపా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సంవత్సరమంతా జరపాలని పార్టీ నిర్ణయించిందని, దానికి అనుగుణంగానే అమెరికాలో ప్రతి నెల నిర్వహిస్తున్నామని టీడీపీ ఎన్నారై యూఎస్ ఏ సమన్వయ కర్త కోమటి జయరాం తెలిపారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని, తెలుగుజాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగ్యస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా నిలిచారని, తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, తానా మాజీ అధ్యక్షులు వేమన సతిష్, నాట్స్ మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates