Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చలు జరగాలి : ప్రధాని మోదీ

దేశ ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సభ్యులందరూ అర్థవంతమైన చర్చలు, విమర్శలు చేసుకోవాలని అభ్యర్థించారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు. అందరి సభ్యుల సహకారంతో పార్లమెంట్ సమావేశాలు విజయవంతం అవుతాయన్న ధీమా తమకుందన్నారు.

 

సమస్యలపై లోతుగా విశ్లేషించి, ప్రజలకు మేలు చేయాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల కాలం ఎంతో ముఖ్యమైనదని మోడీ చెప్పారు. మరో 25 ఏళ్లలో స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది. మన దేశ అభివృద్ధి, స్థితిగతులను నిర్ణయించేది ఈ 25 ఏళ్లే అని అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే సమయం ఇదేనని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates