ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్ట్ 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా అన్న కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మన్ కీ బాత్ లో భాగంగా ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి జాతికి ఓ కీలక సూచన చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ ఆగస్టు 2 నుంచి 15 వరకూ తమ తమ ప్రొఫైల్ పిక్చర్ గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని పిలుపునిచ్చారు. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వ తేదీ మధ్య ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని మోదీ పిలుపునిచ్చారు.
Under the Azadi Ka Amrit Mahotsav, from the 13th to the 15th of August, a special movement – 'Har Ghar Tiranga' is being organised.
Let us further this movement by hoisting the National Flag at our homes. #MannKiBaat pic.twitter.com/NikI0j7C6Z
— PMO India (@PMOIndia) July 31, 2022
ఫలితంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన వారం అవుతామని అన్నారు. అలాగే.. ఆగస్టు 2 న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి కూడా వుందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం ఒక అద్భుతమైన, చారిత్రక ఘట్టానికి సాక్ష్యమిస్తోందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు.