Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సినీ తారలు, క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ… ఫొటోలు వైరల్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సినీ తారలు, క్రీడాకారులు, స్టార్టప్ ప్రపంచంతో సంబంధం ఉన్న వారితో సమావేశమయ్యారు. కర్ణాటక పర్యటనకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమ భారతదేశ సంస్కృతికి, గుర్తింపునకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ప్రధాని మోడీ సినీ నటులతో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి క్రికెటర్ అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ యష్, రిషబ్ శెట్టి తదితరులతో ప్రధాని భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లోని పరిశ్రమలు మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఈ ఫొటోలన్నీ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు.

ఇక… మోదీ కలిసిన వారిలో  లే ఆఫ్‌ ఐటీ ఉద్యోగి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయ్యో శ్రద్దా జైన్‌ ఉన్నారు. మోడీ తనని చూసి ‘అయ్యో’ అని పిలిచారని తెగ సంతోష పడుతున్నారు. ‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మోడీకి కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Related Posts

Latest News Updates