Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

శత వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ తల్లి… ఆశీర్వాదాలు తీసుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ ను కలుసుకున్నారు. తన తల్లి 100 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఆమెను కలుసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా తన తల్లి కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ బ్లాగ్ రాశారు.

అమ్మ గొప్పతనం గురించి వివరించారు. అమ్మ అంటే ఒక పదం కాదని, ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని మోదీ ఆ బ్లాగ్ లో వివరించారు. ఇవ్వాళ మా అమ్మ హీరాబేన్ పుట్టిన రోజు. ఆమెకు శత వసంతాలు నిండాయి. ఒక వేళ మా తండ్రి జీవించి వుంటే.. గత వారమే ఈ శత వసంతాల వేడుకలు జరిపి వుండేవారు. 2022 నాకు ఎంతో ముఖ్యమైన సంవత్సరం అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఎంత బిజీ వున్నా.. గుజరాత్ పర్యటన సందర్భంలో అయినా.. లేదంటే ప్రత్యేకంగా వీలు కల్పించుకొని తల్లిని కలుస్తుంటారు. గత యేడాది మార్చిలో మోదీ తన తల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శత వసంతాలు నిండిన సందర్భంగా మళ్లీ మోదీ ఇవ్వాళ తన తల్లి హీరాబేన్ ను కలుసుకున్నారు. ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం హీరాబేన్ మోదీ సోదరుడైన పంకజ్ మోదీ దగ్గర వుంటోంది. గుజరాత్ లోని గాంధీ నగర్ లో పంకజ్ నివాసం వుంది.

Related Posts

Latest News Updates