తప్పుడు పోలికలు చేస్తూ…. నెటిజన్ల మధ్య అడ్డంగా బుక్కైన హీరోయిన్ సాయి పల్లవికి అగ్రహీరో ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారు. ట్విట్టర్ వేదికగా సాయి పల్లవికి మద్దతిచ్చాడు. మానవత్వమే అన్నింటి కంటే ముందు.. కాబట్టి సాయి పల్లవి మేమంతా నీతోనే వున్నాం అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
ఓ టీవీ డిబేట్ లో పాల్గొంటూ సాయి పల్లవి పొంతన లేని పోలికలు చేసింది. కశ్మీరీ పండిట్ లకు, గోహత్యను పోల్చుతూ కామెంట్స్ చేసింది. దీంతో హిందూ సంఘాలు, నెటిజన్స్ ఒక్కసారిగా భగ్గుమన్నారు. సాయి పల్లవి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆమె నటించిన సినిమాలను అడ్డుకుంటామని భజరంగ్ దళ్ హెచ్చరించింది. అంతేకాకుండా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఆమె పై కేసు కూడా పెట్టారు.
Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3
— Prakash Raj (@prakashraaj) June 19, 2022