Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కామన్ వెల్త్ గేమ్స్ లో పీవీ సింధుకు స్వర్ణం

ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పి వి సింధు అద్భుత విజయం సాధించింది.బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు స్వర్ణం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీలీ ని ఓడించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సింధుకు విషెస్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. అలాగే సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.

Related Posts

Latest News Updates