తెలుగు తేజం స్టార్ షట్లర్ పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగభరిత ప్రకటన చేసింది. కామన్వెల్త్లో బంగారు పతకాన్ని సాధించిన తాను బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ షిప్నకు దూరమయ్యాయని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా తన కాలికి గాయమైందని, దాని కారణంగానే తాను వరల్డ్ చాంపియన్ షిప్నకు హాజరు కాలేకపోతున్నాని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్లో తన కాలికి గాయమైందని, అయితే గెలుపే లక్ష్యంగా సాగిన తాను కామన్వెల్త్ నుంచి వైదొలగేందుకు సిద్ధపడలేదని సింధు తెలిపింది. సెమీస్తో పాటు ఫైనల్స్లోనూ గాయం కారణంగా భరించలేదని నొప్పిని తట్టుకుని నిలబడ్డానని పేర్కొంది. ఆ శ్రమ తనకు బంగారు పతకాన్ని సాధించి పెట్టిందని తెలిపింది.