Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారన్న స్వామీజీ… ఇది వేదిక కాదన్న మరో స్వామీజీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కర్నాటక చిత్రదుర్గలోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని దర్శించుకున్నారు. అక్కడి స్వామీజీల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హవేరి హోసముత్ స్వామీ… రాహుల్ గాంధీ ఏదో ఓ రోజు ప్రధాని అవుతారు అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే మరో స్వామీజీ.. ఆ వ్యాఖ్యలను సరిచేస్తూ… ఇలా మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదని, ప్రజలే దానిని నిర్ణయిస్తారంటూ సరిచేశారు. ఇక… మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య పుట్టిన రోజు వేడుకల్లో రాహుల్ పాల్గొన్నారు. సిద్ధ రామయ్య కర్నాటకను అద్భుతంగా పాలించారని, ఇప్పుడు బీజేపీ అలా పాలించడం లేదని విమర్శించారు.

Related Posts

Latest News Updates