Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ

ఈ నెల 3న  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకుంటామని చెప్పారు. ‘మంత్రులు సుబ్రతా ముఖర్జీ, సాధన్ పాండేలను కోల్పోయాం. పార్థా ఛటర్జీ జైలులో ఉన్నారు. కాబట్టి వారి మంత్రి వర్గ శాఖల పనులన్నీ పూర్తి కావాలి. నేను ఒంటరిగా నిర్వహించడం సాధ్యం కాదు’ అని మమత అన్నారు. అయితే మంత్రి వర్గం మొత్తాన్ని రద్దు చేసి కొత్త కేబినెట్‌ ఏర్పాటు చేసే ఆలోచన లేదని తెలిపారు. మంత్రి వర్గాన్ని రీషఫుల్‌ చేయడంతోపాటు నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల సంఖ్య 23 నుంచి 30కు పెరిగిందని అన్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని, ఈ మేరకు తనకు లేఖలు రాస్తున్నారని ఆమె వెల్లడించారు.

Related Posts

Latest News Updates