Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం ఆగష్టు 21న మహా కుంభాభిషేకంతో భక్తులకు పునఃదర్శన కలుగజేసే కార్యక్రమంలో భాగంగా ఆగష్టు 4వ తేదీ గురువారంనాడు వేద పండితుల ఆధ్వర్యంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు వివిధ పూజా పునస్కారాలు వైభవంగా నిర్వహించారు. గణేశుని జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకా తోపాటు పండితులు, ప్రభుత్వ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు భక్తులు విరివిగా పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates