Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కు కీలక బాధ్యతలు.. పార్లమెంటరీ బోర్డులో

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌కు ఆ పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీలో అత్యున్నత నిర్ణయాత్మాక మండలిగా చెప్పుకునే పార్లమెంటరీ బోర్డులో ఆయనకు అధిష్టానం చోటు కల్పించింది. తద్వారా బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలోనూ ఆయనకు చోటు దక్కింది. మొత్తంగా కొత్తగా 6 గురికి చోటు కల్పిస్తూ పార్లమెంటరీ బోర్డులో ప్రక్షాళన చేపట్టింది. కొత్తగా పార్లమెంటరీ బోర్డులో కొత్తగా చోటు పొందినవారిలో బీఎస్‌.యోడ్యూరప్ప, శర్బానంద్‌ సోనోవాల్‌, డా.కే. లక్ష్మణ్‌, ఇక్బాల్‌ సింగ్‌ లాల్‌పురా, సుధా యాదవ్‌, సత్యనారాయణ్‌ జటియా ఉన్నారు.

Related Posts

Latest News Updates