నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తనకు 2+2 గన్మెన్లను ఇచ్చిందని, అయితే నిన్న ఇద్దరు గన్మెన్లను తొలగించారని చెప్పారు. అయితే మిగిలిన ఇద్దరు గన్మెన్లకు కూడా తనకు వద్దని ప్రభుత్వానికి అప్పగించనున్నాని తెలిపారు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్న తరుణంలో భద్రత పెంచకుండా తగ్గించడమేంటన్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు గన్మన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నా అన్నారు. నాకు కార్యకర్తలే రక్ష అని కోటంరెడ్డి అన్నారు. తాను నియోజకవర్గంలో ఒంటరిగా తిరుగుతానని, తనను ఏమైనా చేసుకోవచ్చని అన్నారు. సభ్యత, సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతుంటేనే ఉంటానని చెప్పారు. శ్రేయాభిలాషులు, రూరల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలే తనుకు రక్షణ అని చెప్పారు. తనకు గన్మెన్లను తగ్గించలేదని అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
