హైదరాబాద్ శివారులోని బీబీనగర్ దగ్గర గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో 7 రైళ్లను పూర్తిగా, 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిఫ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ద.మ. రైల్వే పీఆర్వో రాకేశ్ ప్రకటించారు.
కాచిగూడ- నడికుడి (07791)
నడికుడి- కాచిగూడ (07792)
సికింద్రాబాద్- వరంగల్ (07462)
వరంగల్ – హైదరాబాద్ (07463)
సికింద్రాబాద్- గుంటూరు (12706)
గుంటూరు- సికింద్రాబాద్ (12705)
సికింద్రాబాద్ – రేపల్లె (17645)
ఇక.. పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు…
సిర్ పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్
సికింద్రాబాద్ గుంటూరు
విజయవాడ- సికింద్రాబాద్
భద్రాచలం రోడ్- సికింద్రాబాద్
గుంటూరు- వికారాబాద్
వరంగల్- సికింద్రాబాద్
మిర్యాలగూడ- కాచిగూడ
కాచిగూడ- మిర్యాలగడ
గుంటూరు- సికింద్రాబాద్
సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్
హైదరాబాద్ శివారు ప్రాంతం బీబీ నగర్ దగ్గర గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తుండగా… ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. S1,S4,GS, SLR కోచ్ లు పట్టాలు తప్పాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలుసుకున్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు వేగం చాలా తక్కువగా వుందని, అందుకే ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వివరణ ఇచ్చారు.