ప్రముఖ బెంగాళీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన నవల ఆనందమఠ్ అనే నవల రచించిన వందేమాతర గీతాన్ని మన జాతీయ గేయంగా మనం స్వీకరించాం. ఆ పాట రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ విడుదల చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నాయి. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశం యావత్తు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 1770ని అనౌన్స్ చేశారు. SS1 ఎంటర్టైన్మెంట్, PK ఎంటర్టైన్మెంట్ పతాకాలపై బాహుబభాషా చిత్రంగా ఈ సినిమాను బకించంద్ర ఛటర్జీగారు రాసిన ఆనంద్ మఠ్ అనే నవలను ఆధారంగా చేసుకుని రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వ శాఖలో ఈగ, బాహుబలి వంటి భారీ చిత్రాలకు పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. 2021లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఆకాశవాణి’ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సందర్భంగా .. దర్శకుడు అశ్విన్ గంగరాజు మాట్లాడుతూ ‘‘ఇది నాకు పెద్ద ఛాలెంజింగ్ సబ్జెక్ట్. అయితే లెజెండ్రీ రైటర్ విజయేంద్ర ప్రసాద్గారు కథ, స్క్రీన్ప్లేను అందించారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను మాత్రమే నేను తెరకెక్కించాలి. అద్బుతమైన పీరియాడిక్ సెట్స్, అద్భుతమైన ఎమోషన్స్, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ తదితర ఎలిమెంట్స్ అన్నీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో పక్కాగా సరిపోయాయి. ముందు కాస్త సందేహించాను. కానీ రామ్ కమల్గారితో మాట్లాడిన తర్వాత ఆయన విజన్ తెలసుకున్నాను. నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమాను తెరకెక్కించటానికి సిద్ధమయ్యాను. అలాగే నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మలను రీసెంట్గా ముంబైలో కలిశాను. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలని అందరం సుదీర్ఘంగా చర్చించాం. వారు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు.. వారి టీమ్ వర్క్ చూసి వెంటనే వారితో కనెక్ట్ అయ్యాను. 150 ఏళ్ల క్రితం బంకించంద్రగారు రాసిన అనంద్ మఠ్ నవలలోని వందేమాతరం బ్రిటీష్ వారి పునాదులనే కదిలించాయి. ఈ సందర్భంలో ఇండియాలో టాప్ స్టోరి టెల్లర్ వి.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘వందేమాతరం అనేది ఓ మ్యాజికల్ పదం. మంత్రాన్ని బకించంద్ర ఛటర్జీ అనే మహర్షి మనకు అందించారు. ఇది జాతినంతటినీ ఏకం చేసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. 1770లో భారత స్వాతంత్య్ర సమరం కోసం మనలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెందరో ఉన్నారు. వారి గురించి తెలియజేసే చిత్రమే 1770’’ అన్నారు.
