Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రాజస్థాన్ శ్యాంజీ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురి దుర్మరణం

రాజస్థాన్ లోని సిఖర్ జిల్లా ఖటూ శ్యాంజీ దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని జైపూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దేవాలయం తెరుచుకోగానే… భక్తులు దర్శనం కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. నెలవారీ జాతరలో భాగంగానే భక్తులు పెద్ద మొత్తంలో తరలి వచ్చారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం గెహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ముగ్గురు భక్తులు మరణించడం తీవ్ర విషాదమని, వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా… అంటూ సీఎం గెహ్లోత్ ట్వీట్ చేశారు.

 

 

Related Posts

Latest News Updates