Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ముందస్తుకు వాళ్లు రెడీ అయితే.. మేం కూడా రెడీయే : తలసాని

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని వస్తే ముఖ్యమంత్రి తప్పనిసరిగా స్వాగతం పలకాలనేది ఎక్కడా లేదన్నారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలని అన్నారు. అనైతిక పొత్తులతో ప్రభుత్వాలను పడగొట్టే పనిలో బీజేపీ నిమగ్నమైందని విమర్శించారు. కేంద్రంలో ముందస్తుకు రెడీ అయితే.. రాష్ట్రంలో మేము కూడా రెడీయేనని సంచలన ప్రకటన చేశారు.

అంతేకాకుండా మోదీ తన ట్విట్టర్ లో హైదరాబాద్ సిటీని డైనమిక్ సిటీ అన్నందుకు మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ని డైనమిక్ సిటీగా గుర్తించినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని తలసాని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates