Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు.. 15 న విచారణకు రావాలని ఆదేశం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ఈ నెల 15 న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మరోవైపు సరిగ్గా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తున్న రోజే… అధికార బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బండి సంజయ్ కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఢిల్లీలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణలోనూ నిరసనలు చేపట్టారు. బండి సంజయ్ వెంటనే కవితకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు, మహిళా నేతలు డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates