Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కెనడా రోడ్డు ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం

కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన పిరకల రామకృష్ణ (42) మృతి చెందాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పురుషోత్తం రెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 16 న ఉదయం వాళ్ల మిత్రుడిని కలిసేందుకు ఈ ఇద్దరూ కారులో బయల్దేరారు.

ఒంటోరియా స్టేట్ మిసెస్ ఆగా గ్రామం దగ్గర వెనుక నుంచి వచ్చిన మరో కారు వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. పురుషోత్తం రెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామకృష్ణ భౌతికకాయాన్ని తరలించేందుకు అక్కడి ఎన్నారైలతో గ్రామస్థులు మంతనాలు జరుపుతున్నారు.

Related Posts

Latest News Updates