రాష్ట్ర ప్రజల కోసం ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి మండలానికి అందుబాటులోకి నలుగురు వైద్యులు, విలేజ్ క్లినిక్లకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దకు వెళ్లే వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. డాక్టర్ మారినా నెంబర్ మాత్రం పర్మనెంట్గా ఉండేలా చేస్తామన్నారు. ఏ సమస్య ఉన్న ఏ సమయంలో అయినా డాక్టర్కి ప్రజలు కాల్ చేసే అవకాశం కల్పిస్తాం. వీటికి తర్వాత ఏరియా ఆస్పత్రి డాక్టర్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటాం. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చినా మా డాక్టర్ ఉన్నారన్న నమ్మకం కల్పిస్తాం. గ్రామ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 42,000 పోస్టులను భర్తీ చేశాము. ఇంకో 4 వేల మందిని నియమిస్తాం. సంక్రాంతి నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు