Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మీ ఇంటికే భద్రాద్రి సీతారాముల తలంబ్రాలు… TS RTC బంపర్ ఆఫర్

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని TS RTC నిర్ణయించింది. తమ కార్గో పార్శిల్ కేంద్రాల్లో 116 రూపాయలు చెల్లించి, వివరాలు నమోదు చేసుకోవాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. కల్యాణోత్సవం తర్వాత సీతారాముల తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామన్నారు.

 

గత యేడాది కూడా ఆర్టీసీ ఈ విధానాన్ని అవలంబించి, సక్సెస్ అయ్యింది. తమ తమ వ్యక్తిగత పనులు, అక్కడి రద్దీ వల్ల అందరూ భద్రాద్రికి వెళ్లలేరు. దీంతో ఆర్టీసీయే మన ఇంటి వద్దకే తలంబ్రాలను తెచ్చిస్తోంది. గత యేడాది ఈ కార్యక్రమం సక్సెస్ కావడంతో… ఈ సారి కూడా ఆర్టీసీ ఈ ఆఫర్ ఇచ్చింది. దాదాపు 89 వేల మందికి సీతారాముల తలంబ్రాలను అందించింది ఆర్టీసీ. ఈ సీతారాముల తలంబ్రాలు కావాలనుకునే వారు 9177683134, 9154680020 నెంబర్లలో సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.

Related Posts

Latest News Updates