Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మంత్రి కేటీఆర్ ట్వీట్… కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ ట్వీట్… తెలంగాణలో ట్వీట్ల యుద్ధం

తెలంగాణ ముఖ్య నేతల మధ్య ట్విట్టర్ వార్ సాగుతోంది. మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ ఒకరినొకరు ట్యాగ్ చేసుకోకుండానే విమర్శలకు దిగుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా త్వరలో ఈడీ ముందుకు వెళ్లాల్సి వుంటుందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. మోదీ గారూ.. బండి సంజయ్ ను ఈడీ చీఫ్ కూడా కూడా నియమించినందుకు ధన్యవాదాలు.. ప్రస్తుతం నిజంగానే మోదీ.. ఈడీ అనే డబుల్ ఇంజిన్ నడుపుతున్నట్లు మేం భావిస్తున్నాం అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

https://twitter.com/KTRTRS/status/1550321525697286144?s=20&t=lmvH1AkzuIY1JVb_-O2GwA

 

మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దొంగల్లో ముఖ్యంగా… ట్విట్టర్ టిల్లులో భయం భీతి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి యోగా చాలా మంచిది. విచారణ, దర్యాప్తు సంస్థలు మీ ఇంటి ముందు నిలబడే లోపల గాలిని లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం వంటివి చేయాలని సూచిస్తున్నాను అంటూ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

Related Posts

Latest News Updates