గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఉపకార వేతనాలు అందించింది. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో జరిగిన 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్ధులకు ఈ ఉపకార వేతనాలను అందించారు. నాట్స్ అధ్యక్షుడు బాపు (చౌదరి) నూతి సహకారంతో ఈ ఉపకారవేతనాలను విద్యార్ధులకు బాపయ్య చౌదరి మిత్ర మండలి సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, నూతి సుబ్బారావు, దాసరి సుబ్బారావు, మిన్నెకంటి లక్ష్మీనారాయణలు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు.
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వెంకట అనూష, కె. దత్తు శ్రీ నాగసాయి, పి.నాగరాజు 90% నుండి 96% మార్కులు సాధించిన ముగ్గురుతో పాటు అదేవిధంగా ఇంటర్ లో 92% మార్కులు సాధించిన ఇద్దరికి 10వేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు ఇచ్చారు. బాపయ్య చౌదరి అమ్మ నూతి సీతాదేవి పేరుతో వీటిని విద్యార్ధులకు అందించారు. తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందజేస్తూ… ఇలాగే ప్రోత్సహిస్తున్నామని, అందులో భాగంగానే ఈ ప్రోత్సాహకాలు అని నాట్స్ ప్రతినిధులు ప్రకటించారు.