తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని సినీనటి జీవితా రాజశేఖర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న సందర్భంగా జీవిత కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే దేశాన్ని కాపాడగలరని నమ్మి బీజేపీలో చేరానని తెలిపారు. బండి సంజయ్ ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పాలన ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రకు మద్దతు తెలిపేందుకే పాదయాత్రలో పాల్గొన్నా. సంజయ్ ఎంతో సమర్థవంతమైన నాయకుడు, ప్రజల్లో ఆయన వెళుతున్న తీరు అద్భుతం అని అన్నారు.
