Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కోట్లాది మంది చిరునవ్వుల్లో కనిపిస్తూనే వుంటారు : జగన్ ట్వీట్

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాది మంది చిరునవ్వుల్లో మీ రూపం కనిస్తూనే ఉంటుందని తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘నాన్నా.. మిమ్మ‌ల్ని ఆరాధించే కోట్ల మంది చిరున‌వ్వుల్లో నిత్యం మీ రూపం క‌నిపిస్తూనే ఉంటుంది. ఇచ్చిన మాట, న‌మ్మిన సిద్ధాంతం కోసం ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు క‌ట్టుబ‌డి జీవించిన మీ జీవిత‌మే నాకు స్ఫూర్తి. ప్ర‌జా సంక్షేమం కోసం మీరు చేసిన ఆలోచ‌న‌లు ఈ ప్ర‌భుత్వానికి మార్గ‌ద‌ర్శకం’ అని సీఎం జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

Related Posts

Latest News Updates