Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. స్థానిక సంస్థల కోటా నుంచి 9 స్థానాలు, ఎమ్మెల్యే కోటా నుంచి 7 స్థానాలకు, గవర్నర్ కోటా నుంచి 2 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారన్నారు. సామాజిక న్యాయానికి వైసీపీ కట్టుబడి వుందన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు

నర్తు రామారావు… శ్రీకాకుళం,
కుడిపూడి సూర్యనారాయణ, తూర్పుగోదావరి
వంకా రవీంద్రనాథ్ (పశ్చిమ గోదావరి)
కవురు శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి)
మేరుగు మురళీధర్ (నెల్లూరు)
సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు)
పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (కడప)
ఎ. మధుసూదన్ (కర్నూలు)
ఎస్. మంగమ్మ (అనంతపురం)

ఎమ్మెల్యే కోటా కింద…

పెన్మత్స సూర్యనారాయణ రాజు (విజయనగరం)
పోతుల సునీత (బాపట్ల)
కోలా గురువులు (విశాఖ)
బొమ్మి ఇజ్రాయిల్ (బీఆర్ అంబేద్కర్ కోనసీమ)
జయమంగళ వెంకటరమణ (ఏలూరు)
చంద్రగిరి ఏసురత్నం (గుంటూరు)
మర్రి రాజశేఖర్ (పల్నాడు)

గవర్నర్ కోటా కింద…

కుంభా రవిబాబు (అల్లూరి సీతారామ రాజు)
కర్రి పద్మశ్రీ (కాకినాడ)

Related Posts

Latest News Updates